బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి?

వీడియో క్యాప్షన్, బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి?
ప్రచురణ

265 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 1757, జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది.

ఒకవైపు వందల మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం, మరోవైపు వేలమంది సైన్యం, విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం... ఒకరితో ఒకరు తలపడ్డ యుద్ధం అది.

ఆ యుద్ధం ఒక్కరోజులోనే ముగిసింది. కానీ రెండున్నర శతాబ్ధాలు గడిచినా ఇంకా ఆ యుద్ధ కథ తెలుగు నేలపై ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.

చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా ఒక్కరోజులో ముగిసిన బొబ్బిలి యుద్ధానికి మాత్రం ఎందుకంత ప్రత్యేక స్థానం?

ఆ యుద్ధం తర్వాత బొబ్బిలి, విజయనగర రాజ్యాల పరిస్థితి ఏంటి? రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఆ రెండు సంస్థానాల వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)