ప్రధాని భద్రతే ప్రశ్నార్థకమైతే

ప్రచురణ

''సరిహద్దు ప్రాంతంలో ప్రధాని మోదీ కాన్వాయ్ 15 నిమిషాల పాటు నిలిచిపోవడం అంటే అది చాలా పెద్ద భద్రతా లోపం'' అని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ అజాద్ అభిప్రాయపడ్డారు.

''ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే, సరిహద్దు ప్రాంతంలోని ఒక బ్రిడ్జిపై ప్రధాని కాన్వాయ్ 15 నుంచి 20 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోవడం భద్రతా పరంగా అత్యంత తీవ్రమైన అంశం. ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఎస్పీజీ భద్రత ఉంటుంది. కానీ, ఓవరాల్‌గా ఆయన భద్రతను పర్యవేక్షించాల్సిన భాద్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే'' అని ఆయన పేర్కొన్నారు.

''ఎవరి ప్రాణాలకైతే అత్యధిక ప్రమాదం పొంచి ఉంటుందో... అలాంటివారు కేవలం ఒక బుల్లెట్ ఫ్రూఫ్ కారును నమ్ముకొని, బహిరంగ ప్రదేశాల్లో నిలిచిపోవడం అనేది చాలా ఘోరమైన తప్పిదం'' అని ఆయన నొక్కి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)