You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కి ప్రమాదం
భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలీకాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారని భారత వాయుసేన తెలిపింది.
ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని పేర్కొంది.
హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు, గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. వారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్లు ఉన్నారని ట్వీట్ చేసింది.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా
- సమంత: ‘చైతూతో విడిపోయాక చనిపోతానేమో అనిపించింది..’
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- బీబీసీ 100 మంది మహిళలు 2021: జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
- నాగాలాండ్ హింస: 70 ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ ఉద్యమ చరిత్ర ఏంటి?
- వసీం రిజ్వీ ఇప్పుడు జితేంద్ర త్యాగి అయ్యారు.. ఇస్లాం విడిచిపెట్టి హిందువుగా మారారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)