తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండచరియలు.. డ్రైవరు అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

వీడియో క్యాప్షన్, తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు.. నిలిచిపోయిన రాకపోకలు
ప్రచురణ

భారీ వర్షాలు కురుస్తుండడంతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి..

దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో అధికారులు రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు.

గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు.

బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళ్తుండగా భారీ శబ్దం రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు.

కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో మరో అయిదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి.. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)