ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ఘాటు

వీడియో క్యాప్షన్, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ఘాటు
ప్రచురణ

ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ ) అనగానే ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తుంది.

ప్రస్తుతం ఏవోబీ అంటే ఘాటైన గంజాయి అనే చర్చ నడుస్తోంది. ఈ గంజాయి ఘాటు ఏపీ రాజకీయాల్లో సైతం కల్లోలం సృష్టిస్తోంది.

గంజాయికి కేరాఫ్ అడ్రస్ అంటూ నిత్యం వార్తల్లో ఉండే గ్రామాల్లో గంజాయి సాగు, వ్యాపారాలలో నిజమెంతో తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు టీం ఆ ప్రాంతాల్లో పర్యటించింది.

ఏవోబీలోని గంజాయి తోటల్లోని పంట ఎటువంటి అడ్డంకులు లేకుండా అమ్ముడైతే ఎకరానికి రెండు సీజన్లలో సరాసరి 50 లక్షల వరకు ఆదాయం వస్తుందని, దీనికి పెట్టుబడి కేవలం ఐదు లక్షలు మాత్రమేనని చెబుతుంటారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని పోలీసులు బీబీసీతో చెప్పారు. అయితే ఇది 15 వేల ఎకరాల కంటే ఎక్కువే ఉండొచ్చని అనధికార అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)