టీకా వేసుకున్నాక శరీరానికి చెంచాలు అతుక్కొంటున్నాయంటున్న మహారాష్ట్ర వాసి.. ఇది సాధ్యమేనా?

ప్రచురణ

కరోనా వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత కొంతమందికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. కొంతమంది చేతులు నొప్పి పెడుతున్నాయని, గాఢంగా నిద్ర వస్తోందని అంటున్నారు. మరి కొంతమంది తమకు ఏ రకమైన ప్రభావాలు కనిపించడం లేదని చెప్తున్నారు.

అయితే, నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక విచిత్రమైన విషయం చెప్పారు. వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత తన శరీరం అయస్కాంతంలా మారిపోయిందని అరవింద్ సోనార్ అంటున్నారు.

ఇనుప వస్తువులు, నాణేలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది శరవేగంగా వైరల్ అయ్యింది.

"ఓరోజు మా అబ్బాయితో మాట్లాడుతుంటే వ్యాక్సీన్ వేయించుకున్న వారిలో కొంతమందికి స్టీల్ వస్తువులు శరీరానికి అతుక్కుంటున్నాయని చెప్పాడు. ఇదేదో తమాషాగా ఉందనిపించి నేను కూడా ప్రయత్నించా. స్టీల్ వస్తువులు నా శరీరానికీ అతుక్కుంటున్నాయి. నా శరీరం అయస్కాంతంలా వాటిని ఆకర్షిస్తోంది" అని అరవింద్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)