కోనసీమ రైల్వే లైన్ కార్యరూపం దాల్చడం లేదెందుకు

ప్రచురణ

"కోనసీమ రైల్వే లైన్‌ సాధిస్తాం''

"రాబోయే ఐదేళ్లలో కోనసీమలో రైల్వే కూత వినిపిస్తాం"

"కేంద్రంతో పోరాడి కాకినాడ-నర్సాపురం రైల్వే లైన్‌ను పూర్తి చేస్తాం."

ఇలాంటి మాటలు కోనసీమ వాసులు కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికల్లోనూ వింటూనే ఉన్నారు. కానీ ఆ ప్రాంతవాసుల కల ఇంకా నెరవేర లేదు. ఈరోజు ఇండియన్ రైల్వే డే సందర్భంగా ఈ అభ్యర్థన మరోమారు బలంగా వినిపిస్తోంది.

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఆనాటి అమలాపురం ఎంపీ జీఎంసీ బాలయోగి నుంచి ఆ తర్వాత కొందరు కొంత మేరకు ప్రయత్నం చేసినా అసలు లక్ష్యాన్ని మాత్రం చేరలేదు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు రాక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం భూసేకరణ కోసం దాదాపు రూ.300 కోట్లు వెచ్చించాల్సి ఉన్న సమయంలో తగిన రీతిలో స్పందించడం లేదనే అభిప్రాయం కోనసీమ ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)