‘‘మీరు స్టార్ హోటళ్లలో తింటూ, పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?”
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని తొగరాం పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. శనివారం తమ్మయ్యపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించిన వాణిశ్రీ, సంబంధిత అధికారికి ఫోన్ చేసి భోజనం నాణ్యత గురించి మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.