పేరైనా పెట్టకముందే చనిపోయాడు

వీడియో క్యాప్షన్, పేరైనా పెట్టకముందే చనిపోయాడు
ప్రచురణ

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మణించారు.

నాగ్‌పుర్‌కు 62 కి.మీ. దూరంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు (తెల్లవారితే శనివారం) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగం నుంచి దట్టమైన పొగలు రావడంతో అక్కడ పనిచేస్తున్న నర్సు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విభాగంలోని 17 మంది శిశువుల్లో ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)