టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద ఈ కోటలో...

వీడియో క్యాప్షన్, టిప్పు సుల్తాన్‌ను చంపేశాక బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద ఈ కోటలో...
ప్రచురణ

మైసూర్ సింహంగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ను... అత్యంత ప్రముఖులైన భారతీయ పాలకుల్లో ఒకరిగా గుర్తిస్తారు.

18వ శతాబ్దం చివరి కాలంలో దక్షిణాదిలో బ్రిటిష్ రాజ్‌ను ఎదిరించి పోరాడారు టిప్పు.

1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను ఓడించి, హతమార్చిన తర్వాతే మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగారు వలస పాలకులు.

టిప్పు మరణం తర్వాత ఆయన సంపదనంతా బ్రిటిషర్లు దోచుకున్నారు. అందులో కొంత భాగాన్ని నజరానాల రూపంలో బ్రిటన్‌కు తరలించారు.

అలాంటి వందలాది విలువైన బహుమతుల్ని బ్రిటన్‌లోని వేల్స్‌లో గల పోయిస్ కాసిల్‌లో ఇప్పటికీ చూడొచ్చు.

మధ్యయుగాల నాటి ఈ 13వ శతాబ్దపు కోటను బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ సందర్శించారు.

ఈ అద్భుత భవనానికీ, టిప్పు సుల్తాన్‌తోనూ, భారత్‌తోనూ ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)