కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాందిస్తున్న గిరిజన మహిళలు

ప్రచురణ

ఒకప్పుడు వాళ్లంతా రోజు కూలీలు. కానీ ఇప్పుడు రోజుకు వేలకు వేలు సంపాదిస్తున్న రైతులుగా ఎదిగారు.

గుజరాత్‌కు చెందిన ఈ గిరిజన మహిళలు కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

వీరిది వల్సాడ్ జిల్లా కప్రాడా తాలూకా వేరిబవాడ్ గ్రామం. కప్రాడా తాలూకాలోని వాళ్లు బతుకుదెరువు కోసం వలస పోతుండేవారు.

నీటి కొరత కారణంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది కాదు.

బీఐఏఎఫ్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ అనే సంస్థ సౌర శక్తి ద్వారా వీరి నీటి సమస్యకు పరిష్కారం చూపింది. వ్యవసాయం గురించి శిక్షణ కూడా ఇచ్చింది.

ఇప్పుడు ఇక్కడ రకరకాల కూరగాయలు పండుతున్నాయి.

గ్రామంలోని మహిళలు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కో బృందంలో పది మంది ఉంటారు.

వీరంతా కలిసి పనిచేస్తారు. పంటను నేరుగా టోకు వ్యాపారులకు అమ్ముతారు.

కూరగాయల సాగు ద్వారా వస్తున్న ఆదాయంతో ఇప్పుడు ఇక్కడి గిరిజన మహిళలు తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నాయి.

పోరాటపటిమతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)