సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున నిర్మించిన అటల్ టన్నెల్ విశేషాలివీ

ప్రచురణ

హిమాచల్‌ ప్రదేశ్‌లోని హిమాలయాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ప్రపంచంలో సముద్ర మట్టానికి 10 వేల అడుగులకు పైగా ఎత్తులో నిర్మించిన అత్యంత పొడవైన సొరంగ మార్గం ఇదే.

మనాలీ, లాహౌల్, స్పీతీ లోయలను కలుపుకుంటూ పోయే ఈ సొరంగ మార్గం 9.02 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగ మార్గంలో ఏడాది పొడవునా ప్రయణించవచ్చు. ఇది మనాలి, లేహ్‌ల మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)