You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భర్త, మరిది, మామ ఆత్మహత్య చేసుకున్నా.. ట్రాక్టర్ కొని వ్యవసాయం చేస్తున్న ధీర వనిత
అకోలా జిల్లాలోని కట్యార్ గ్రామంలో నివసిస్తున్నారు జ్యోతి. ఆమెది వ్యవసాయ కుటుంబం.
ఆమె భర్త, మరిది, మామ అందరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కానీ జ్యోతి మాత్రం వ్యవసాయంపై ఆశ వదులుకోలేదు.
ఆమె ఇప్పుడు 29 ఎకరాలు సాగు చేస్తున్నారు. పొలంలో అవసరమైన పనులన్నీ తానే చేసుకుంటారు.
జ్యోతి తాయి ఈ స్థాయికి అంత సులభంగా చేరుకోలేదు.
కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో మీ పొలం అమ్మేయడం మంచిదని ఆమెకు కొందరు సలహా ఇచ్చారు.
‘‘పొలం అమ్మేసి ఇంట్లో ఉండండి. దేశ్ముఖ్ కుటుంబంలో వాళ్లు ఇలా పొలం పనులు చేయకూడదు' అంటూ నాకు చాలా మంది చాలా చెప్పారు. నేను పొలాల్లో చెత్తపనులన్నీ చేస్తున్నానన్నారు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు’’ అంటారామె.
ఏమీ తెలియకున్నా వ్యవసాయం ఎందుకు చేస్తున్నారని అడిగినపుడు ఆమె ఏమన్నారంటే...
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్తో అయోమయంలో పడిన టిక్టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)