You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దళిత కుటుంబంపై దాడి చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్ గుణలో దళిత రైతులపై పోలీసుల దాడి ఘటన సంచలనం రేపుతోంది. కాలేజీ నిర్మాణానికి తమ భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని దళిత రైతు దంపతులు ఆరోపించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని వారు అడ్డుకోవడంతో పోలీసులు వారిని తీవ్రంగా కొట్టారు.
తమ భూమి తమకు కాకుండా పోతోందని ఆందోళనలో రైతు దంపతులు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. భర్త కోలుకుంటుండగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.
మంగళవారం జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఈ దంపతుల ఏడుగురు పిల్లలు పోలీసుల దాడి సమయంలో ఏడుస్తూ, కేకలువేస్తూ కనిపించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కాలేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న వారి తల్లిదండ్రులను పోలీసులు తీవ్రంగా కొట్టారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)