దళిత కుటుంబంపై దాడి చేసిన పోలీసులు

ప్రచురణ

మధ్యప్రదేశ్‌ గుణలో దళిత రైతులపై పోలీసుల దాడి ఘటన సంచలనం రేపుతోంది. కాలేజీ నిర్మాణానికి తమ భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని దళిత రైతు దంపతులు ఆరోపించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని వారు అడ్డుకోవడంతో పోలీసులు వారిని తీవ్రంగా కొట్టారు.

తమ భూమి తమకు కాకుండా పోతోందని ఆందోళనలో రైతు దంపతులు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. భర్త కోలుకుంటుండగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

మంగళవారం జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఈ దంపతుల ఏడుగురు పిల్లలు పోలీసుల దాడి సమయంలో ఏడుస్తూ, కేకలువేస్తూ కనిపించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కాలేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న వారి తల్లిదండ్రులను పోలీసులు తీవ్రంగా కొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)