You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వైరస్: భవిష్యత్తులో ప్రయాణాలు ఇలా ఉంటాయి
విమాన ప్రయాణాల విషయంలో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) బయోసెక్యూరిటీ ఫర్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ పేరిట ఒక ప్రోటోకాల్ను విడుదల చేసిందని వైమానిక రంగ నిపుణులు అశ్వని ఫడ్నవిస్ చెప్పారు.వైమానిక రంగాన్ని పునఃప్రారంభించడంలో భాగంగా అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకుల వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. అదే నియమ నిబంధనల్ని భారతీయ విమానయాన మంత్రిత్వ శాఖ కూడా రూపొందిస్తోంది.
ప్రయాణీకులు టెర్మినల్లో అడుగు పెట్టగానే వారిని స్క్రీనింగ్ చేసేందుకు విదేశీ విమనాశ్రయాల్లో ఉన్నట్టు కంప్యూటర్లను ఏర్పాటు చేసే యోచనలో భారత్ ఉంది. ఈ విషయంలో వీలైనంత వరకు అధికారుల ప్రమేయాన్ని తగ్గించాలనుకుంటోంది.
వెబ్ చెక్ ఇన్ కూడా తప్పనిసరి కానుంది. అలాగే ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణీకులు ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకువెళ్లడం ద్వారా విమానాశ్రయంలో ఎవరికి వారే తమ లగేజ్ను చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది.
“విమానాల్లో ఇకపై ఎయిర్ హోస్టెస్ల అందమైన చిరునవ్వులు ఇక మనకు స్వాగతం పలకకపోవచ్చు. ఎందుకంటే కొన్ని విమానయాన సంస్థలు క్యాబిన్ సిబ్బందికి పీపీఈ కిట్లు ధరించడం తప్పనిసరి చేశాయి” అని అశ్విని తెలిపారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)