వీడియో: రెండేళ్ల కిందట గోల్డ్ మెడల్ సంపాదించింది.. ఇప్పుడు నీళ్లు మోస్తోంది

ప్రచురణ

ఈమె పేరు సరిత గైక్వాడ్. 2018 ఆసియా క్రీడల్లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించిపెట్టిన క్రీడాకారిణి. ఇప్పుడు బిందెడు నీళ్ల కోసం ప్రతి రోజూ కిలోమీటరు దూరం నడుస్తోంది.

గుజరాత్‌ రాష్ట్రంలోని దంగ్ జిల్లాలో ఒకవైపు కరోనావైరస్‌ను, మరోవైపు తాగునీటి కొరతను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో సరైన తాగునీటి సరఫరా వ్యవస్థ లేదు.

ఆహ్వా ప్రాంతానికి చెందిన సరిత గైక్వాడ్ ఒకప్పుడు ట్రాక్ మీద పరుగులు పెట్టి, పతకం సాధించి, ముఖ్యమంత్రి అభినందనలు పొందారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ, నెత్తిన బిందె పెట్టుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు.

ఆమె ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

రిపోర్టర్: ధర్మేశ్ అమిన్, గుజరాత్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)