వీడియో: ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
"మేం రోజుకు నాలుగు గంటలే చదువుకు కేటాయిస్తాం. మిగిలిన సమయమంతా ఆటల్లో, వివిధ వస్తువుల తయారీలో, వ్యవసాయ పనుల్లో, మా కమ్యూనిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో గడిపేస్తాం. అయినా మా చదువులకేం ఢోకా లేదు. మేం ఆడుకుంటానే పనులు చేస్తాం. పనులు చేసుకుంటూనే చదువుకుంటాం. చదువుకోవడంతోపాటు సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకుంటాం" అని సుశాంత్ చెబుతున్నాడు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సుశాంత్, 'జీవన వికాస విద్యావనం' అనే విభిన్నమైన పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
విజయవాడ-నూజివీడు ప్రధాన రహదారిలో ఉండే అడవి నెక్కలం సమీపాన ఈ పాఠశాల ఉంది. ఎవరి పని వారే చేసుకుంటూ, అందరి పనులూ చేస్తూ, అందరూ కలిసే సాగే ఇక్కడి విద్యావిధానం వర్తమాన బోధనా విధానానికి పూర్తి భిన్నంగా ఉంది.
దీనిని 'స్కూల్' అనడం కంటే 'ఆధునిక ఆశ్రమం' అనడం సరైనదని పూర్వ విద్యార్థులు అంటుంటారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- పోప్ ఫ్రాన్సిస్: 'ఫోన్లు పక్కన పెట్టండి.. కుటుంబ సభ్యులతో మాట్లాడండి'
- మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2020లో ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)