You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: గుజరాత్ అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా?
2002లో గుజరాత్ లో జరిగిన మతతత్వ అల్లర్లకు వీరిద్దరూ ముఖచిత్రాలుగా మారారు. ఆశోక్ మోచీ ఫొటో అల్లరిమూకల విధ్వంసకాండకు ప్రతీకగా మారగా, కుతుబుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి చిత్రం ఆ అల్లర్లలో నష్టపోయిన బాధితులకు ప్రతీకగా నిలిచింది. అయితే వీరిద్దరూ, ఇటీవల కేరళలో ఒక రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో ఒకే వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత నుంచి తమ మధ్య శత్రుత్వాన్ని మరచిపోయి మిత్రులుగా మారారు. అంతేకాదు, దళితుడైన అశోక్ మోచీ ఒక చెప్పుల దుకాణం తెరవగా, దానికి కుతుబుద్దీన్ రిబ్బన్ కత్తిరించారు.
‘‘మీడియాలో తన ఫొటో కనిపించే సమయానికే ఆశోక్ పశ్చాత్తాపంలో పడ్డారు. ఎందుకంటే ఆయన నివసించేది ముస్లింలు ఎక్కువగా ఉండే బస్తీలోనే’’ అని కుతుబుద్దీన్ బీబీసీతో చెప్పారు.
‘‘కుతుబుద్దీన్ మంచి వ్యక్తి. నిజమైన ముస్లిం. అల్లర్లలో ఆయన ఎంత నష్టపోయినా సరే, హిందూ మతానికి వ్యతిరేకంగా చిన్న మాట కూడా మాట్లాడలేదు’’ అని ఆశోక్ మోచీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు
- బిల్కిస్ బానో: పదిహేడేళ్లుగా పోరాడుతున్నా. సుప్రీం కోర్టు నాకు అండగా నిలిచింది
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’
- గుజరాత్: బ్రెజిల్కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)