వీడియో: ఈ కొండముచ్చు రోజూ బడికి వెళ్తోంది.. పాఠాలు వింటోంది.. పిల్లలతో ఆడుకుంటోంది

ప్రచురణ

డీఎల్ నరసింహ, బీబీసీ కోసం

ఒక కొండముచ్చు రోజూ పాఠశాలకు వెళుతోంది.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లి గ్రామానికి నెల రోజుల కిందట ఓ కొండముచ్చు వచ్చింది.

గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులతో కలిసి పాఠాలు వింటూ విద్యార్థిగా మారిపోయింది.

విరామ సమయంలో పిల్లలతో కలసి ఆడుకుంటోంది.

వారిచ్చే తినుబండారాలను ఆరగిస్తోంది.

పిల్లలంతా కలసి దీనిని ‘లక్ష్మీ’ అని పిలుస్తున్నారు.

ఇలా పాఠశాలకు రోజూ కొండముచ్చు రావడం, పిల్లలతో కలసిపోవడంపై ప్రధానోపాధ్యాయుడు షేక్ అబ్దుల్ లతీఫ్ ఏమంటున్నారో పైన ఉన్న వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)