You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎలా బతకాలి... ఎక్కడికి పోవాలి?'
కేరళ వరదల్లో విషాద గాథలెన్నో. వీటిలో ఒకటి పద్మిని గాథ. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆమె భర్త, సోదరి సహా ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయారు.
వీరిలో ఐదుగురి మృతదేహాలు దొరికాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మసీదులోనే పోస్టుమార్టం చేశారు.
పద్మిని కుటుంబంలోని ఇతర మహిళలూ జరిగిన నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు.
"గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇంత విధ్వంసం లేదు. కొన్ని మరమ్మతులు చేయించుకోవాల్సి వచ్చింది అంతే. ఈ సంవత్సరం కూడా వర్షాలు చివరికి తగ్గుతాయని మేం భావించాం. మేం ఏదైనా చేయకముందే మా ఇళ్లను, కుటుంబాన్ని కోల్పోయాం" అని పద్మిని చెప్పారు.
ప్రభుత్వాలు సహాయ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ పద్మిని లాంటి బాధితుల కుటుంబాలు ఇకపై మామూలుగా ఉండడం చాలా కష్టం.
"తరువాత ఏం చేయాలో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు. నేను నా ఇంటిని కూడా కోల్పోయాను" అని ఆమె చెప్పారు.
కుటుంబంలోని మగవారంతా ఘటనా స్థలంలో మృతదేహాల కోసం వేచి ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
- ‘హత్తుకొని పడుకునే ఆ పిల్లలు... అలాగే ప్రాణాలొదిలారు’
- గోదావరి వరదలు: 12 రోజులుగా వరద ముంపులో ‘రంగస్థలం’ గ్రామం
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
- పక్షులు ఢీకొని ఎగిరిన కాసేపటికే మొక్కజొన్న పొలంలో దిగిన విమానం
- భారత్తో యుద్ధానికి సిద్ధం.. గుణపాఠం చెప్పే సమయం వచ్చింది : ఇమ్రాన్ ఖాన్
- షార్క్లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)