హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా?

హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా?
ప్రచురణ

అండమాన్ దీవులు, లక్షదీవుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ సముద్రపు దీవి ఉందని చాలామంది తెలియకపోవచ్చు. 

కాకినాడ తీరం నుంచి కనిపించే ఆ దీవిలో నివాసం ఉంటున్న వారి గురించి తెలుసా? బంగాళాఖాతంలోని ఈ దీవిలో నివసించే వారికి ఏ చిన్న సరకు కావాల్సినా పడవ ఎక్కి సముద్రం దాటాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక దీవి- హోప్ ఐలాండ్.కాకినాడ నగరానికి పెట్టని కోటలా మారిన ఈ దీవి విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి.

అన్ని సదుపాయాలకు దూరంగా అక్కడ నివశిస్తున్న వారి జీవితాలు సమస్యలమయంగా కనిపిస్తాయి.

సముద్రంలో ఏర్పడిన అనేక దీవులతో పోలిస్తే ఈ హోప్ ఐలాండ్ వయసు చాలా తక్కువ. గడిచిన 200 ఏళ్లుగా ఇది క్రమంగా విస్తరించింది.

గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ధవళేశ్వరం వద్ద కాటన్ కట్టిన ఆనకట్ట కారణంగా ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. 

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)