వరంగల్‌లో వంద కాలనీలను ముంచెత్తిన వరదలు

ప్రచురణ

వరంగల్ పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న వ‌ర్షాల‌కు పట్టణంలోని సుమారు 100 వరకూ కాలనీలు నీటమునిగాయి.

ఇళ్లల్లోకి నీరు చేరడం, నడుంలోతు వరకూ వీధుల్లో నీరు చేరడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి. చెరువులు కబ్జా చేసి కాలనీ కట్టడం వల్లే సమస్య తీవ్రమైందని భావిస్తున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి రావడంతో నిరాశ్రయులైన ప్రజలను తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)