You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మాస్కు ధరించాలని చెప్పినందుకు తోటి మహిళా ఉద్యోగిపై దాడి
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా టూరిజం శాఖలో ఓ అధికారి సహోద్యోగినిపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ దృశ్యాల్లో కనిపిస్తున్న అధికారి పేరు సి భాస్కర్. ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ నెల్లూరు డివిజన్ డిప్యూటీ మేనేజర్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన వ్యవహారం పట్ల ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.
బాధితురాలి ఫిర్యాదుపై ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు, ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనల నడుమ ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో ఉన్న హోటల్ను ఇటీవల క్వారంటైన్ సెంటర్గా మార్చారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచేందుకు ఈ హోటల్ఉపయోగిస్తున్నారు.
అక్కడే ఉన్న కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్గా సి భాస్కర్ బాధ్యతల్లో ఉండగా, కాంట్రాక్ట్ పద్దతిలో సీనియర్ అసిస్టెంట్ హోదాలో సీహెచ్ ఉషారాణి పనిచేస్తున్నారు.
ఆమె వికలాంగురాలు కావడంతో చాలాకాలంగా ఆమెపై అధికారిగా ఉన్న భాస్కర్ వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నెల్లూరు డీఎస్పీ శ్రీనువాసుల రెడ్డి బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)